News April 4, 2025
ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టుకు రూ.29 కోట్లు

ఖమ్మం నగరంలోని ఖిల్లాపై రోప్ వే ప్రాజెక్టుకు జిల్లా యంత్రాంగం రూ.29 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం ఖర్చుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఖిల్లాపై రోప్ వే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఖిల్లా మెట్ల మార్గం కుడి వైపున రెండు అంతస్తుల బేస్ స్టేషను ఏర్పాటు చేయడంతో పాటు రోప్ వేలో 200-250 మంది బరువును తట్టుకునే సామర్థ్యమున్న 275 మీటర్ల తీగలను ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News November 1, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
News November 1, 2025
కంప్యూటర్ల మరమ్మతుకు టెండర్లు దాఖలు చేయాలి: అ.కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్స్ మరమ్మతులకు NOV 6 లోపు టెండర్లు దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. కంప్యూటర్ మరమ్మతుల నిమిత్తం 69 ఉన్నత పాఠశాలలకు రూ.15 వేలు చొప్పున, 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.11.10 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి గల వారు DEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 1, 2025
క్షేత్రస్థాయి వాస్తవ నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్

ఖమ్మం: మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా తప్పుడు ఫిగర్ను ఇవ్వకూడదని, నష్టం జరిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిహారం అందేలా చూడాలని సూచించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అంచనాలు తయారు చేయాలని అధికారులకు వివరించారు.


