News April 4, 2025
నారాయణపేటలో ఐదుగురిపై కేసు నమోదు

నారాయణపేట పట్టణంలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రేవతి తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. వాహనాలకు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 27, 2026
మంచుదుప్పటి నడుమ గుడి ఎంత బ్యూటిఫుల్గా ఉందో!

అమెరికాలో భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మంచు భారీగా పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ డల్లాస్లోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మెరిసిపోతోంది. ఈ అద్భుత దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ మంచుతో ఉన్న ఆలయం ఫొటోలు ప్రస్తుతం SMలో వైరలవుతున్నాయి.
News January 27, 2026
ప్రొద్దుటూరు 1 టౌన్ CI బదిలీ

ప్రొద్దుటూరు 1 టౌన్ <<18970409>>CI శ్రీరామ్ బదిలీ <<>>అయ్యారు. ఒకటిన్నర నెల క్రితం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపారు. దీంతో ఆయనపట్ల అధికార పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండగా ఆ విషయం MLA దృష్టికి తీసుకుని వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం నూతన సీఐగా TV కొండారెడ్డిని నియమిస్తూ అన్నమయ్య SP ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన RSASTF-అన్నమయ్యలో పనిచేస్తున్నారు.
News January 27, 2026
పలాస: కుటుంబ కలహాలతో యువకుడి హంగామా

పలాస కేటీ రోడ్డు ఇందిరా చౌక్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం ఉదయం <<18971917>>మద్యం మత్తులో ఓ యువకుడు<<>> తన చేయిని కోసుకొని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి యత్నించి భయాభ్రాంతులకు గురి చేశాడు. దీంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పలాస రాజాం కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కుటుంబ కలహాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.


