News March 26, 2024
ఉప్పల్లో మ్యాచ్.. ఫ్యాన్స్కు సజ్జనార్ విజ్ఞప్తి

TG: రేపు ఉప్పల్లో SRH-ముంబై మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో RTC ఎండీ సజ్జనార్ క్రికెట్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకుల కోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ బస్సులు ప్రారంభమవుతాయన్నారు. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News February 9, 2026
దూసుకెళ్తున్న భారత్.. G20 దేశాల్లో టాప్

2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ GDP వృద్ధి 6.4%గా ఉండనుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. G20 దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని వెల్లడించింది. పెట్టుబడులు పెరగడం, స్థిరమైన వృద్ధి దీనికి కారణమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు, ఆదాయపన్ను రాయితీలు కీలకమని పేర్కొంది. మరోవైపు RBI కూడా తొలి రెండు త్రైమాసికాల వృద్ధి అంచనాలను పెంచింది.
News February 9, 2026
ఏపీలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు

AP: రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నట్లు పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో వెల్లడైంది. సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9%, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలు రికార్డయినట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అత్యల్పంగా విశాఖలో 3.96%గా ఉంది.
News February 9, 2026
వైకుంఠ పరివారమే ఈ చతుర్విధ అవతారాలు!

ధర్మ సంస్థాపన కోసం విష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడు. అయితే విష్ణువు ఒక్కడే కాకుండా ఆయనకు నిరంతరం తోడుగా ఉండే ఆయుధాలు, వాహనం కూడా రాముని సోదరులుగా జన్మించాయి. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాగా ఆయనకు నీడలా ఉండే లక్ష్మణుడు విష్ణువు శయ్య అయిన ఆదిశేషుడి అంశతో జన్మించాడు. భరతుడు విష్ణువు చేతిలోని పాంచజన్యం(శంఖం) అవతారం. శత్రుఘ్నుడు దుష్టసంహారానికి వాడే సుదర్శన చక్రం అంశతో జన్మించాడు.


