News April 4, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు..

image

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాలూరులో 37.1°C, మక్కువ 39.1, పాచిపెంట 36.8, కురుపాం 40.8, గరుగుబిల్లి 41.3, గుమ్మలక్ష్మీపురం 41.2, కొమరాడ 40.7, జియ్యమ్మవలస 41.2, పార్వతీపురం 40.3, సీతానగరం 40.6, బలిజిపేట 40.3, పాలకొండ 39.4, వీరఘట్టం 40.3, సీతంపేట 39, భామిలో 39.7గా నమోదౌతాయని తెలిపింది.

Similar News

News March 4, 2026

టాప్ సెల్లింగ్ కార్‌గా డిజైర్!

image

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ డామినేషన్ కొనసాగుతోంది. FY26లో APR – FEB మధ్య టాప్ 10 సెల్లింగ్ కార్స్ లిస్ట్‌లో ఈ సంస్థకు చెందినవే ఆరు కార్లు ఉన్నాయి. డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రీజా, వ్యాగన్ ఆర్, ఫ్రాంక్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పటికే 2,07,906 యూనిట్ల అమ్మకంతో డిజైర్ FY26లో అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా నిలవనుంది. ఇక డిజైర్ తర్వాత అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా టాటా నెక్సాన్ ఉంది.

News March 4, 2026

నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

image

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.

News March 4, 2026

హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్

image

తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనమధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.