News April 4, 2025

మక్తల్: బైక్‌లో ఉంచిన.. రూ.1,50,000 చోరీ

image

బ్యాంకు దగ్గర బైక్‌లో ఉంచిన నగదును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన మక్తల్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. SI భాగ్యలక్ష్మి రెడ్డి కథనం మేరకు.. మాగనూరు మండలం నేరేడుగం గ్రామానికి చెందిన లింగాయత్ నాగప్ప మక్తల్ పట్టణంలోని SBIలో రూ. 1,50,000 డ్రా చేశాడు. బ్యాంక్ ఎదుట పార్క్ చేసిన తన బైక్‌లో ఉంచి అక్కడే ఉన్న జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి వచ్చేసరికి నగదు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News January 11, 2026

రాజమార్గం కానున్న.. HYD నుంచి ORR కారిడార్.!

image

HYD నుంచి ORR చేరుకోవాలంటే సిటీ ట్రాఫిక్ కష్టాల్లో గంటల సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక త్వరలో ఈ తిప్పలు తీరనుంది. HYD పారడైజ్ జంక్షన్ నుంచి ORR శామీర్‌పేట జంక్షన్ వరకు 18 KM కారిడార్ నిర్మాణం జరగనుంది. ఇందులో 11.5KM ఎలివేటెడ్, 6KM ఎట్ గ్రేడ్, 0.5KM అండర్ గ్రౌండ్ కారిడార్ నిర్మిస్తారు. ఈప్రాజెక్ట్ పూర్తయితే ఇక ORR వెళ్లేందుకు రాజమార్గం కానుందని ఓ అధికారి తెలిపారు.

News January 11, 2026

కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

image

కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడిపికొండ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కిలో గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బండి నూతన ప్రసాద్ (20) తూర్పు గోదావరి జిల్లా చిన్నయ్యపాలెం వాసిగా గుర్తించారు. NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై బి.శివ తెలిపారు.

News January 11, 2026

మంథని అభివృద్ధికి రూ.45 కోట్లతో శ్రీధర్ బాబు శంకుస్థాపన

image

మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల రూపాయలతో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బస్ స్టాండ్‌లు, కుల సంఘాల కమ్యూనిటీ హాల్‌లు, సీసీ రోడ్ల నిర్మాణాలు, బ్రిడ్జి నిర్మాణం, దేవాలయాల సుందరీకరణ పనులు, ఈద్గా నిర్మాణం పనులు, వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం, మహిళా సంఘం భవన నిర్మాణం పనులు ఉన్నాయి. వీటితో మంథనికి మహర్దశ పట్టనున్నది.