News April 4, 2025
వరంగల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తండ్రి, కొడుకు

ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న 57వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు న్యాయ నిర్ణేతగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన కోట రాంబాబు ఎంపికయ్యాడు. ఆయన కుమారుడు సృజన్ ఖోఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో వారిని గ్రామస్థులు అభినందించారు.
Similar News
News April 9, 2025
మహబూబాబాద్: GREAT.. వీధిలైట్ల కింద చదువుకుంటున్న విద్యార్థి

వీధిలైట్ల కింద చదివి గొప్పవారై అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాశారని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే బయ్యారం మండలంలోని జగ్గు తండాలో సన్నివేశాన్ని కనిపించింది. కరెంటు పోయిన సమయంలో వీధిలైటు కింద కూర్చొని చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని Way2News చిత్రీకరించింది. చదువుపై ఆసక్తి ఉంటే ఎక్కడైనా, ఎలాగైనా చదవుకోవొచ్చని, ఈ విద్యార్థి నిరూపించాడు. ఏ స్కూల్ అని అడగగా బయ్యారం ప్రభుత్వ హైస్కూల్ అని సమాధానం ఇచ్చాడు.
News April 9, 2025
ధోనీ ఔటయ్యారని భోరున విలపించింది!

పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ధోనీ పోరాడినప్పటికీ చెన్నైని గెలిపించలేకపోయారు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. కాగా.. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 12 బంతులాడిన MS 3 సిక్సులు, ఒక ఫోర్తో 27 రన్స్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ ఆయనలో ఇదివరకటి ఆట ఇంకా అలాగే ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News April 9, 2025
వృత్తి శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

ఖమ్మం: ఉపాధి కల్పనపై వృత్తి శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పురంధర్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ట్రైనింగ్ పార్టర్గా ఉన్న వృత్తి శిక్షణ సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన వృత్తి శిక్షణ సంస్థలు తమ దరఖాస్తులను HYDలోని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏప్రిల్ 12 లోగా సమర్పించాలన్నారు.