News April 4, 2025

తీవ్ర విషాదం.. బావిలో విషవాయువులు పీల్చి 8 మంది మృతి

image

మధ్యప్రదేశ్‌ కొండవాట్‌లో విగ్రహాల నిమజ్జనం కోసం పాడుబడ్డ బావిని శుభ్రం చేసేందుకు వెళ్లి 8 మంది మరణించారు. గంగౌర్ పండుగ నేపథ్యంలో 150 ఏళ్ల బావిని శుభ్రం చేసేందుకు తొలుత ఓ కూలీ బావిలోకి దిగాడు. బావిలోని విషవాయువులు పీల్చి మునిగిపోతుండగా అతడిని కాపాడేందుకు మిగిలిన కూలీలు అందులోకి దిగారు. ఇలా మొత్తం 8 మంది ప్రాణాలు వదిలారు. వారికి ఈత వచ్చినా విషవాయువులు పీల్చి నీటిలో మునిగిపోయారని అధికారులు తెలిపారు.

Similar News

News September 12, 2025

డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్

image

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

News September 12, 2025

రెడ్‌లైట్ థెరపీ గురించి తెలుసా?

image

రెడ్‌లైట్ థెరపీ శరీర సౌందర్యం పెంచే ఓ వైద్య పద్ధతి. గాయాలు మానడానికి, చర్మంపై ముడతలు, మచ్చలు, గీతలు తొలగించడానికి ఈ చికిత్సను ఉపయోగిస్తారు. వృద్ధాప్యంతో వచ్చే చర్మ సంబంధిత సమస్యలనూ ఈ థెరపీ ద్వారా నయం చేస్తారు. ఈ థెరపీ కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీన్ని మొటిమలు, చర్మ క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మంలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. దీంతో చర్మంపై ముడతలు తగ్గుతాయి.

News September 12, 2025

పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

image

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.