News March 26, 2024
మచిలీపట్నం MP టికెట్ రేసులో కొత్త పేరు

మచిలీపట్నం ఎంపీ టికెట్ రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలశౌరికి ఈ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా, గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ నరసింహారావు పేరు కూడా పవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరిని రెండ్రోజుల్లో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు.. విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 24, 2026
బాలల సంక్షేమం కోసం చర్యలు తప్పవు: కలెక్టర్

బాలల సంక్షేమం, సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆధార్ లేని అనాధ పిల్లలకు తక్షణమే కార్డులు మంజూరు చేయాలని సూచించారు.
News March 23, 2026
మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహణకు చర్యలు: కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ PGRS హాలులో ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాలన్నారు.
News March 23, 2026
మొవ్వలో షార్ట్ సర్కూట్.. 3 గృహాలు దగ్ధం

మొవ్వ మండలం కాజ శివారు కుళాయి గుంటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 గృహాలు దగ్ధమయ్యాయి. విలువైన వస్తు సామగ్రి, నగదు, బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు చందోలు ఏసు పాదం, కొమ్ముకూరి వరప్రసాద్, వేమూరి ఇజ్రాయేల్కు చెందిన గృహాలు అగ్ని ప్రమాదానికి గురవడంతో రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఘటనను VRO గోపికృష్ణ MRO మస్తాన్కు లిఖితపూర్వకంగా తెలియజేశారు.


