News April 4, 2025
సుల్తానాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. రామగుండానికి చెందిన ఇద్దరి దుర్మరణం

రామగుండం మజీద్ కార్నర్ ఏరియాకు చెందిన ఇమ్రాన్, నిస్సార్ అలియాస్ గౌస్ సుల్తానాబాద్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. HYD నుండి వస్తున్న క్రమంలో సుల్తానాబాద్ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుకగా వచ్చిన వీరి కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించడం పట్ల రామగుండంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
భద్రాద్రి: మా రహదారి కష్టాలు తీర్చే నాధుడే లేరా?

చర్ల మండలం తిప్పాపురం నుంచి బత్తిన పెళ్లికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించాలంటే డోలీ మోతలే దిక్కని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు కూడా గ్రామానికి రావడం మానేశారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.
News November 2, 2025
వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్గా పెవిలియన్కు పంపింది.
News November 2, 2025
VJA: జోగి రమేశ్ విచారణ పూర్తి.. కుమారుడికి నోటీసులు జారీ

నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేశ్ సిట్ విచారణ పూర్తి అయ్యింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జనార్దనరావుతో సంబంధాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. కాసేపట్లో ప్రభుత్వాస్పత్రికి జోగి రమేశ్ తరలించారు. జోగి రమేశ్ చిన్న కుమారుడు జోగి రోహిత్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని రోహిత్కు సిట్ నోటీసులు జారీ చేశారు.


