News April 4, 2025

పార్వతీపురం: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

భార్య మందలించిందని ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరిగింది. వల్లరిగుడబ గ్రామానికి చెందిన పలగర్ర పోలి (40)ని మందు తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. వెంటనే ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పార్వతీపురం అవుట్ పోస్ట్ ASI భాస్కరరావు తెలిపారు.

Similar News

News July 7, 2025

WGL: లోకల్‌ పంచాయితీ తెగేనా..!

image

స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే BC రిజర్వేషన్‌ 42% అమలు అంశం గ్రామాల్లో కాక పుట్టిస్తోంది. మరో నెలన్నర లోపల ఎన్నికలు వస్తాయంటూ ఉమ్మడి జిల్లాలోని 1,702 పంచాయతీలు, 775 MPTC, 75 ZPTCల స్థానాల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.

News July 7, 2025

మెదక్: కుంటుంబం చెంతకు తప్పిపోయిన బాలుడు

image

మెదక్ పట్టణానికి చెందిన <<16899428>>వాసిప్ హుస్సేన్<<>> మానసిక స్థితి సరిగ్గా లేక వారం రోజుల కింద తప్పిపోయాడు. Way2Newsలో వచ్చిన కథనంతో తప్పిపోయిన బాలుడు కుటుంబం చేంతకు చేరాడు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో సంచరిస్తున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News July 7, 2025

KNR: సర్కార్ స్కూల్ చిన్నారులకు కేంద్రమంత్రి శుభవార్త

image

కేంద్రమంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీతో పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కిట్స్ అందజేయనున్నారు. KNR లోక్‌సభ పరిధిలోని 50-60వేల చిన్నారులకు స్కూల్ బ్యాగ్, నోటు బుక్స్, పెన్స్, పెన్సిల్, వాటర్ బాటిల్, షూ కిట్‌ను అందించేస్తారని SGTU నేతలు తెలిపారు. ఒక్కొక్కరికి ₹1000 విలువైన కిట్లు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.