News April 4, 2025

అవి తప్పుడు వార్తలు.. మేం విప్ జారీ చేశాం: వైసీపీ

image

AP: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా వైసీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేయలేదని వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, తాము అధికారికంగా విప్ జారీ చేశామని ట్వీట్ చేసింది. కొందరు రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తాము సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ స్పష్టం చేసింది.

Similar News

News September 12, 2025

మెడికల్ కాలేజీల టెండర్లపై జగన్ వార్నింగ్.. సజ్జల ఏమన్నారంటే?

image

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ మెడికల్ కాలేజీల టెండర్లపై హెచ్చరికలు జారీ చేశారని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కోర్ సెక్టార్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యం ఉండాలనేదే మా లక్ష్యం. ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే కచ్చితంగా హెచ్చరిస్తాం’ అని అన్నారు. ఇక తమ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నందుకే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 12, 2025

లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో నిందితుల రిమాండ్ ముగియనుండటంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్‌ను FSLకు పంపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన ఫోన్‌ను అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది.

News September 12, 2025

మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: బుగ్గన

image

AP:YCP ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఆనాడు TDP ఆరోపించిందని మాజీ మంత్రి బుగ్గన Way2News కాన్‌క్లేవ్‌లో చెప్పారు. వాటిని మించి ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చాలని, లేకపోతే తప్పు చేసినట్లు ప్రభుత్వం ఒప్పుకోవాలని కోరారు. YCP హయాంలో చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించిందన్నారు. తమ ప్రభుత్వంలో GST వసూళ్లు పెరిగితే, కూటమి ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరగడంలేదని ప్రశ్నించారు.