News April 4, 2025
వికారాబాద్: పెద్దేముల్ హత్యకు గురైన యశోద వివరాలు

వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 2వ తేదీన పెద్దేముల్ మండల కేంద్రంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆ మహిళ ఎవరు అనేది నిర్ధారించినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. బొంరాస్పేట మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోదగా గుర్తించారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 16, 2025
నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదాం: కలెక్టర్

నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. మంగళవారం శివనగర్లోని ఓ కన్వెన్షన్ హలులో విత్తనాలు, ఎరువుల, క్రిమిసంహారక మందుల కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ అంకిత్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అనురాధతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. నకిలీ పురుగుల మందులు అమ్మితే పీడీ యాక్టు నమోదుతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 16, 2025
చిత్తూరు: ‘ప్రభుత్వానికి, ప్రజలకు వారధి జర్నలిస్టులే’

ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటి వారు అని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఈ నెల 22న జరగనున్న APWJF 4వ జిల్లా మహాసభలకు ఆహ్వానిస్తూ కలెక్టర్ ఛాంబర్లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వాస్తవాలను ప్రచురించడంలో జర్నలిస్టులు కృషి చేస్తున్నారన్నారు. వారి సంక్షేమానికి అండగా ఉంటామన్నారు.
News April 16, 2025
శ్రీదేవి బయోపిక్లో చేస్తారా?.. హీరోయిన్ రియాక్షన్ ఇదే

హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్లో చేస్తారా? అని యాంకర్ అడగ్గా.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్లువచ్చి గోదారమ్మ(గద్దలకొండ గణేశ్) సాంగ్లో చేశానని చెప్పారు. హీరోయిన్కి ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా సూర్యతో ఈ బ్యూటీ నటించిన ‘రెట్రో’ మూవీ మే 1న రిలీజ్ కానుంది.