News April 4, 2025
నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
Similar News
News January 20, 2026
NRPT: ‘కల్లు కింగ్’ లింగయ్య గౌడ్ కన్నుమూత

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ‘కల్లు కింగ్’గా పేరుగాంచిన గౌని లింగయ్య గౌడ్ మహరాజ్(102) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. 1975 నుంచి 2010 వరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కల్లు సొసైటీలపై ఆయన ప్రత్యేక పట్టు సాధించారు. పాలమూరు గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన ఆయన అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News January 20, 2026
జగిత్యాల జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీలు

జగిత్యాల జిల్లా పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. డీఐజీ జోన్–II బసరా ఆదేశాల మేరకు ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పీఎస్ ఎస్సై ఏ.అనిల్ను మల్లాపూర్ పీఎస్కు బదిలీ చేయగా, కథలాపూర్ పీఎస్ ఎస్సై సి.నవీన్ కుమార్ను ఇబ్రహీంపట్నం పీఎస్కు నియమించారు. మల్లాపూర్ పీఎస్ ఎస్సై కోసానా రాజును జగిత్యాల సీసీఎస్ పోస్టుకు బదిలీ చేశారు.
News January 20, 2026
NLG: మున్సిపల్ పోరు.. పెరగనున్న మహిళల ప్రాతినిధ్యం

మున్సిపల్ ఎన్నికల వేళ ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్ల లెక్కలు మారాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది మహిళలకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా జనరల్ మహిళా స్థానాలు 5 నుంచి 7కు పెరగడం విశేషం. అయితే, బీసీ మహిళలకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. గతంలో 3 స్థానాలుండగా ఈసారి వాటిని 2కే పరిమితం చేశారు. ఇక SC మహిళలకు గతంలో లాగే ఒక స్థానాన్ని కేటాయించారు. ఈ మార్పులు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపనున్నాయి.


