News April 4, 2025
భక్తులు మెచ్చేలా ఏర్పాట్లను చేయాలి: మంత్రి తుమ్మల

రామయ్య కళ్యాణానికి వచ్చే భక్తులు మెచ్చే విధంగా తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే వెంకట్రావుపాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
ఉక్రెయిన్ ఆరోపణలు నిరాధారం: చైనా

రష్యాకు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఉక్రెయిన్ చేసిన ఆరోపణలు నిరాధారమని చైనా స్పష్టం చేసింది. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా వైఖరి చాలా క్లియర్గా ఉంది. సీజ్ఫైర్ రావాలనే మేం కోరుకుంటున్నాం. యుద్ధాన్ని త్వరగా ముగించి శాంతి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలకూ చెబుతున్నాం. అలాంటిది రష్యాకు మేం ఎందుకు ఆయుధాలు సరఫరా చేస్తాం? అవి అర్థంలేని ఆరోపణలు’ అని పేర్కొంది.
News April 18, 2025
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తా.. కేసులకు భయపడను: భూమన

AP: SV గోశాలలో ఆవుల మృతిపై మాట్లాడినందుకు తన మీద <<16135353>>కేసులు పెట్టడంపై<<>> టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తే తాను వెనక్కి తగ్గుతాననుకుంటే అది వారి భ్రమ అని పేర్కొన్నారు. ఈ 10 నెలల కాలంలో టీటీడీ అప్రదిష్టపాలైందని విమర్శించారు.
News April 18, 2025
సారంగాపూర్: యాక్సిడెంట్.. ఒకరి మృతి

సారంగాపూర్ మండలం ధని శివారులో బైక్ ఢీకొట్టడంతో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ధని, జామ్ గ్రామాల మధ్య మతిస్థిమితం లేని వ్యక్తి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ప్రయాణిస్తున్న నిశాంత్, గణేశ్కు గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే 8712659516ను సంప్రదించాలని సూచించారు.