News April 4, 2025

బాసరలో వేద భారతి విద్యాలయంలో విషాదం

image

బాసర మండలకేంద్రంలోని వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఓ విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Similar News

News October 28, 2025

భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్

image

హీరోయిన్లకు యాక్షన్ సీన్లుంటే వాటికోసం స్టంట్ ఉమన్లు ఉంటారు. కానీ 50ఏళ్ల క్రితం ఓ మహిళ ఇలా స్టంట్లు చేసిందంటే నమ్ముతారా? ఆమే భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్ రేష్మా పఠాన్. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 400 కి పైగా చిత్రాల్లో ఆమె స్టంట్లు చేశారు. షోలే సినిమా తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆమె సేవలకుగాను ‘ఫిలిం క్రిటిక్స్ గిల్డ్’ రేష్మాను ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డుతో సత్కరించింది.

News October 28, 2025

NLG: కొనుగోలు కేంద్రాలు సరే.. స్థలమేదీ..!

image

నల్గొండ జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. కోసిన ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకూ సరిపడా స్థలం లేదు. పది నుంచి 20 రాశులు రాగానే స్థలం కొరత ఏర్పడుతోంది. ధాన్యం సేకరణకు జిల్లాలో ఇప్పటికే 85% ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో కేవలం కొన్ని కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకు సరైన స్థలాలే లేవని రైతులు అంటున్నారు.

News October 28, 2025

జగిత్యాల: రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు

image

మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, వరి కోత యంత్రాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ సూచించారు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే పంటలు కోతకు సిద్ధంగా ఉండడంతో రైతులు కోతలను వాయిదా వేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత కోతల పనులు ప్రారంభించాలని కోరారు.