News April 4, 2025
15th ఫైనాన్స్కు మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎంపిక

కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లకు గ్రాంట్లు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన 15వ ఫైనాన్స్కు ఈసారి మన మహబూబ్నగర్ నగరపాలక సంస్థ ఎంపికైంది. ఈ ఎంపికను ఆస్తి పన్నులను 21 శాతం వసూలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు అవకాశం కల్పించింది. ఇక నేడో రేపో మహబూబ్నగర్ నగర పాలక సంస్థకు రూ.30 కోట్ల గ్రాంట్స్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.
Similar News
News April 18, 2025
మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.
News April 18, 2025
జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <
News April 18, 2025
MMTSలో అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్

కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.