News April 4, 2025

బర్డ్‌ ఫ్లూతో చిన్నారి మరణం.. రంగంలోకి కేంద్రం

image

AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో <<15964152>>తొలి మరణం<<>> సంభవించడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ, ముంబై‌, మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన పలువురు డాక్టర్లతో కలిసి అధ్యయనం చేయిస్తోంది. నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి ఎప్పుడు అనారోగ్యానికి గురైంది? ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది? వైద్యులు ఎలాంటి చికిత్స అందించారు? అనే వివరాలను ఆ బృందం ఆరా తీసింది. చిన్నారి కుటుంబీకులు చికెన్ కొనుగోలు చేసిన దుకాణంలో శాంపిల్స్ సేకరించింది.

Similar News

News September 12, 2025

మెడికల్ కాలేజీల టెండర్లపై జగన్ వార్నింగ్.. సజ్జల ఏమన్నారంటే?

image

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ మెడికల్ కాలేజీల టెండర్లపై హెచ్చరికలు జారీ చేశారని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కోర్ సెక్టార్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యం ఉండాలనేదే మా లక్ష్యం. ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే కచ్చితంగా హెచ్చరిస్తాం’ అని అన్నారు. ఇక తమ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నందుకే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 12, 2025

లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో నిందితుల రిమాండ్ ముగియనుండటంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్‌ను FSLకు పంపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన ఫోన్‌ను అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది.

News September 12, 2025

మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: బుగ్గన

image

AP:YCP ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఆనాడు TDP ఆరోపించిందని మాజీ మంత్రి బుగ్గన Way2News కాన్‌క్లేవ్‌లో చెప్పారు. వాటిని మించి ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చాలని, లేకపోతే తప్పు చేసినట్లు ప్రభుత్వం ఒప్పుకోవాలని కోరారు. YCP హయాంలో చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించిందన్నారు. తమ ప్రభుత్వంలో GST వసూళ్లు పెరిగితే, కూటమి ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరగడంలేదని ప్రశ్నించారు.