News April 4, 2025

సిరిసిల్లా: ‘సన్నబియ్యం రవాణా పంపిణీ వేగవంతం చేయాలి’

image

రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా, పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సన్న బియ్యం సరఫరాపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.

Similar News

News April 16, 2025

సిరిసిల్ల లేదా హస్నాబాద్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి: బండి సంజయ్

image

సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. బుధవారం ఆయనకు దిల్లీలో బండి వినతిపత్రం సమర్పించారు. ఈ స్కూల్ వల్ల గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, దేశభక్తి, నాయకత్వ శిక్షణ లభిస్తుందన్నారు. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News April 16, 2025

NLR: యువతిని బెదిరించి చైన్ దోచుకెళ్లాడు

image

ఓ యువతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగింది. బాలాజీనగర్ పోలీసుల సమాచారం మేరకు..మర్రిపాడుకు చెందిన రీమాశేఖర్ నారాయణ వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ స్నేహితుడితో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి బెదిరించి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు.

News April 16, 2025

NLG: మరోసారి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

image

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11, 15, 16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే.

error: Content is protected !!