News April 4, 2025

వరంగల్- HYD పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

image

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైలులు నడపాలని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

Similar News

News April 18, 2025

నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నందన్

image

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News April 18, 2025

UPI పేమెంట్స్‌పై GST.. క్లారిటీ

image

రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్‌పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.

News April 18, 2025

కాటారం: వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

ఆదివారంపేట వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. కొన్ని రోజుల క్రితం మృతురాలు మల్లక్క(67) కోడలు శ్రీలతతో నిందితుడు శివ(42)కు పరిచయమైంది. కాగజ్‌నగర్‌లో ఇద్దరు 3 నెలలు సహజీవనం చేశారు. శివ వేధింపులు తాళలేక శ్రీలత ఆదివారంపేటకు వచ్చింది. శ్రీలతను కలవాలని శివ చూడగా నిరాకరించింది. మల్లక్కను చంపితే కేసు శ్రీలత మీదకే వస్తుందని భావించి హత్య చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.

error: Content is protected !!