News April 4, 2025
వనపర్తి: ‘ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి’

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండ్ల రాజు,పుట్ట ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వనపర్తిలోని సీఐటీయూ కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునీత అధ్యక్షతన ఆశా వర్కర్ల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
Similar News
News April 15, 2025
ఆ విషయంలో ప్రభుత్వం తోక ముడవడం ఖాయం: తాటిపర్తి

AP: వైసీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, లిక్కర్ పాలసీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటరిచ్చారు. ‘అదానీ దగ్గర రూ.1,750 కోట్లు లంచం తీసుకుని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని మాపై విమర్శలు చేసి తోక ముడిచారు. ఇప్పుడు మద్యం కుంభకోణం అంటూ మరోసారి విష ప్రచారం చేసి తోక ముడుస్తారు’ అని Xలో పోస్టు చేశారు.
News April 15, 2025
గార : పోరుబందరు పోర్ట్లో మత్యకారుడు అదృశ్యం

గార మండలం మోగదాలపాడుకు చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల సిద్ధార్థ (సర్దార్) (44) చేపలు వేట కోసం గుజరాత్లోని పోరుబందరు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట పూర్తైన తరువాత రూమ్కి రాలేదని బోట్ డ్రైవర్ గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటి నుంచి వెతికామని ఆయన కానరాలేదన్నారు. సిద్ధార్థకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News April 15, 2025
దుబాయ్లో ఇద్దరు తెలుగోళ్లను నరికి చంపిన పాకిస్థానీ

TG: దుబాయ్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు. నిర్మల్(D) సోన్కు చెందిన అష్టపు ప్రేమ్సాగర్ (40), NZB(D)కు చెందిన శ్రీనివాస్ దుబాయ్లోని ఓ ఫేమస్ బేకరీలో పనిచేస్తున్నారు. అదే బేకరీలో పనిచేసే ఓ పాకిస్థానీ మత విద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.