News April 4, 2025

బాసరలో వరంగల్ విద్యార్థి మృతి

image

నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 30, 2025

యూరియా సరఫరాపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

image

యూరియా సరఫరాపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి 2025-26లో 1,12,345 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయన్నారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

News December 29, 2025

వరంగల్: యూరియా యాప్ డౌన్..!

image

జిల్లా రైతులకు యూరియా యాప్ సరిగా పని చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ఓపెన్, డేటా లోడ్ కాకపోవడంతో యూరియా నమోదు, స్లిప్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్య వల్ల ఎరువుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రైతులు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News December 29, 2025

WGL: యూరియాకు క్యూలైన్లు.. యాప్‌తో బుకింగ్‌ ముద్దు.!

image

వరంగల్‌ జిల్లాలో సోమవారం నుంచి యూరియా యాప్‌ అమలులోకి రానుంది. రైతులు ప్లే స్టోర్‌లో “Fertilizer Booking App” డౌన్‌లోడ్ చేసుకుని, తమ పంట వివరాలను నమోదు చేయడంతో యూరియాను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ సత్య శారద తెలిపారు. బుకింగ్ చేసుకున్నాక, వచ్చే ఐడీ 24 గంటల వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రక్రియపై రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు.