News March 26, 2024

సత్తుపల్లి కౌన్సిలర్ చాంద్ పాషాకు కేటీఆర్ ఫోన్

image

సత్తుపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ చాంద్ పాషాపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. సంఘటనను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం చాంద్ పాషాకు ఫోన్ చేసి పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడి చేసిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

Similar News

News September 30, 2024

నేడు కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరెట్లో ఇవాళ జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు.

News September 29, 2024

తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖి

image

తెలంగాణలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఈరోజు 33 జిల్లాల తహశీల్దార్లతో మంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని మంత్రి పొంగులేటి చెప్పారు.

News September 29, 2024

HYDలో మధిర మండల వాసి మృతి

image

మధిర మండలం రాయపట్నంకి చెందిన కంపసాటి కొండ హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోర్టు కేసులో జామీను కోసం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతణ్ని హైదరాబాదుకు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహజ మరణమా లేదా ఇతర కారణమా తెలియాల్సి ఉంది.