News April 4, 2025
గద్వాల: ‘14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలి’

గద్వాల జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయంలో శుక్రవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అదే విధంగా బూత్ స్థాయి వరకు ప్రాథమిక సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
Similar News
News April 18, 2025
కాలేయ ఆరోగ్యం: ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

శరీరంలోని మలినాల్ని శుభ్రం చేయడంలో లివర్దే ప్రధాన పాత్ర. అంతటి కీలకమైన లివర్లో ఏదైనా సమస్య తలెత్తితే కనిపించే కొన్ని లక్షణాలు:
-> కడుపునిండా తింటూ కంటినిండా నిద్రపోతున్నా నీరసంగానే అనిపిస్తుండటం, తరచూ కామెర్లు రావడం, కళ్లు, చర్మం పసుపురంగులో ఉండటం, విరోచనాల రంగులో మార్పు, పొట్టకు కుడివైపు పైన నొప్పి రావడం, వాంతులు, కాళ్లు-మడమల్లో వాపు ఉంటే లివర్ టెస్ట్ చేయించుకోవాలి.
*రేపు కాలేయ ఆరోగ్య దినోత్సవం
News April 18, 2025
సంగారెడ్డి: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని ఎస్పీ జిల్లా కార్యాలయంలో కుల సంఘాల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏమైనా అత్యవసరం అయితే 87126 56777 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ రావు పాల్గొన్నారు.
News April 18, 2025
NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.