News April 4, 2025
జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ: భద్రాద్రి కలెక్టర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం జిల్లా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం తరలించామని తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా తగు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
Similar News
News December 31, 2025
నేటి నుంచే పోలవరం జిల్లా

రంపచోడవరం కేంద్రంగా డిసెంబర్ 31 నుంచి పోలవరం జిల్లా అమలులోకి వస్తుందని ప్రభుత్వం తుది నోటిఫికేషన్ మంగళవారం జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పోలవరం పేరుతో ఈ జిల్లా పిలువబడుతోందని వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
News December 31, 2025
SKLM: జనవరి 2 నుంచి కొత్త పాస్పుస్తకాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి వీటిని అందజేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 652 గ్రామాల్లో మొత్తం 2,54,218 పుస్తకాలను పంపిణీ చేయనున్నారని స్పష్టం చేశారు.
News December 31, 2025
డాంగ్ టావో కోడి.. కేజీ మాంసం రూ.1.50 లక్షలు

‘డాంగ్ టావో’ వియత్నాంకు చెందిన కోడి. దీని ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ కోడి పాదాలు కాస్త లావుగా ఉంటాయి. వియత్నాం రెస్టారెంట్లలో ఈ కోడి మాంసం చాలా స్పెషల్. ఇక్కడి ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోడి మాంసాన్ని తినకపోతే తప్పుగా భావిస్తారు. అందుకే ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఈ కోడి మాంసాన్ని తింటారు. ఇంత డిమాండ్ వల్లే ఈ మాంసం కిలో దాదాపుగా రూ.1.50 లక్షలుగా ఉంటుంది. సీజన్ బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.


