News April 4, 2025
జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ: భద్రాద్రి కలెక్టర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం జిల్లా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం తరలించామని తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా తగు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
Similar News
News April 18, 2025
సంగారెడ్డి: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని ఎస్పీ జిల్లా కార్యాలయంలో కుల సంఘాల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏమైనా అత్యవసరం అయితే 87126 56777 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ రావు పాల్గొన్నారు.
News April 18, 2025
NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
News April 18, 2025
విశాఖలో దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్.. పోలీసుల సూచనలు

విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం నిర్వహించే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్కు వచ్చే వారికి పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. వీఐపీ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రధాన గేటు ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వారి వాహనాలకు లోపల పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధారణ టికెట్లు ఉన్నవారికి పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వారి వాహనాలు నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు.