News April 4, 2025
హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Similar News
News April 18, 2025
అమెరికా వైమానిక దాడి.. యెమెన్లో 74 మంది మృతి

యెమెన్లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.
News April 18, 2025
నటుడిపై ఫిర్యాదు వెనక్కి తీసుకుంటా: నటి

అసభ్యంగా ప్రవర్తించాడంటూ మలయాళ నటి విన్సీ అలోషియస్ ఓ నటుడిపై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది టామ్ చాకో అని బయటికి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. ‘నేను అధికారుల్ని నమ్మాను. అతడి పేరు బయటికి రావొద్దని స్పష్టంగా చెప్పాను. అయినా పేరును లీక్ చేశారు. ప్రతిభావంతుడైన నటుడికి సినిమాల్లో అవకాశాలు ఆగకూడదు. తన తప్పును సరిదిద్దుకుంటాడన్నదే నా ఆశ’ అని పేర్కొన్నారు.
News April 18, 2025
US నిరాకరిస్తున్న వీసాల్లో 50శాతం భారత విద్యార్థులవే!

వలసదారులు, విద్యార్థులపై అమెరికా అనుసరిస్తున్న విధానంలో అత్యధికంగా భారత విద్యార్థులే ప్రభావితమవుతున్నారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్(AILA) నివేదిక ప్రకారం.. తిరస్కరణకు గురవుతున్న వీసాల్లో 50శాతం భారత విద్యార్థులవే ఉంటున్నాయి. చైనా మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నా ఆ దేశానికి చెందిన విద్యార్థుల వీసాల్ని అధికారులు కేవలం 14శాతమే రిజెక్ట్ చేస్తున్నారని అసోసియేషన్ తెలిపింది.