News April 4, 2025
బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు

AP: బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పీరోసిస్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకి ఇటీవల ఓ బాలిక మృతి చెందిందని చెప్పారు. దీనిపై ICMR బృందం అధ్యయనం చేసిందన్నారు. కాగా ఆ బృందంతో సీఎం ఇవాళ సమీక్షించారు.
Similar News
News April 19, 2025
మైనర్ మినరల్ పాలసీ రిలీజ్ చేసిన ప్రభుత్వం

AP: రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఖనిజాల పాలసీ-2025 విడుదల చేసింది. అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే దీని ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. 2022 మార్చి 13 వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులకే లీజు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్లాంటి ఖనిజాలున్న భూములను 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మరోవైపు, యాన్యువల్ డెట్ రెంట్ మూడు నెలల్లోగా కట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
News April 19, 2025
ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్(ఫొటోలో) మరణం.
1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం.
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ జననం.
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రారంభం.
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.
News April 19, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్(సెషన్-2) ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ రిలీజ్ చేసిన NTA అధికారులు తాజాగా విద్యార్థుల పర్సంటైల్ స్కోరులో ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ <