News April 5, 2025
వరంగల్ CGHSకు సిబ్బందిని నియమించండి: MP కావ్య

కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి రోలి సింగ్ను ఢిల్లీలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ CGHS వెల్నెస్ సెంటర్ ప్రారంభం కోసం వైద్య సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. సుమారు 12 వేల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స కోసం దూర ప్రయాణం చేయాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై సానుకూల స్పందించినట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
వనపర్తి: జీవో నంబర్ 282ను వెంటనే రద్దు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని దినం 8 గంటల నుంచి పది గంటలకు పెంచుతూ దొడ్డిదారిన జీవో నంబర్ 282 ను తెచ్చిందని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి ఎనిమిది గంటల పరిధిలో సాధించుకున్నారన్నారు. శ్రమదోపిడి చేసే అందుకే 10 గంటలకు పెంచారని, జీవో రద్దు చేయాలన్నారు.
News July 6, 2025
తుని: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

తునిలో జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల, టాయిలెట్లు పరిశీలించారు. పిల్లల ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించాలని ప్రిన్సిపల్ యజ్ఞను ఆదేశించారు. మెరుగైన విద్యను అందించాలని సూచించారు.
News July 6, 2025
పోలీసు శాఖలో 2, 844 కేసులు రాజీ: ఎస్పీ

ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో పోలీస్ శాఖకు సంబంధించిన 2,844 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. 827 IPC కేసులు, 417 స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసులు, 143 ఎక్సైజ్ కేసులు, 1, 454 పెట్టీ కేసులు (చిన్నపాటి చట్టపరమైన నేరాలు)తో మొత్తం 2, 844 కేసులు రాజీ అయ్యాయన్నారు.