News April 5, 2025

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ 

image

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయ సంస్థలకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌లను పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి రవి కుమార్ పాల్గొన్నారు. 

Similar News

News April 9, 2025

కృష్ణా: భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వండి- కలెక్టర్

image

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమైన కలెక్టర్ CSR నిధుల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు నిధుల కొరత వలన సగంలో ఆగిపోయాయన్నారు.

News April 8, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా : యూజీ పరీక్షల షెడ్యూల్ విడుదల 
☞ కృష్ణా : 37 మందికి గ్రేడ్ -3 కార్యదర్శులగా పదోన్నతి 
☞ గన్నవరం : వంశీ కి 22 వరకు రిమాండ్ పొడిగింపు
☞ గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్
☞ కృష్ణా: అధికారులు పని తీరుపై కలెక్టర్ సీరియస్
☞ గన్నవరం: చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్
☞ కృష్ణా జిల్లాప్రధాన న్యాయమూర్తి బదిలీ

News April 8, 2025

కృష్ణా జిల్లాలో 37 మందికి గ్రేడ్-3 కార్యదర్శులుగా పదోన్నతి

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 37 గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 19 మంది, జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 18 మంది జూ.అసిస్టెంట్లను గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత పదోన్నతులు పొందిన కార్యదర్శులకు కలెక్టర్ అందజేశారు.

error: Content is protected !!