News April 5, 2025
KMR: జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు

యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 33 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమై 686 టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 5, 2025
వేతనం వేములవాడలో.. విధులు యాదగిరిగుట్టలో..!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో విధులు నిర్వర్తిస్తూ వేములవాడ రాజన్న ఆలయం నుంచి వేతనం పొందుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. చాలాకాలం పాటు వేములవాడలో పనిచేసి యాదగిరిగుట్టకు బదిలీపై వెళ్లిన ఓ అధికారి వేతనాన్ని వేములవాడ నుంచి చెల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికారి వేతనం యాదగిరిగుట్ట నుంచి చెల్లించాలని, లేదంటే వేములవాడలో పనిచేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
News November 5, 2025
వేములవాడ: దర్శనాల నిలిపివేతపై పుకార్లు.. పోటెత్తిన భక్తులు

తెలంగాణలోనే అతిపెద్ద శైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో త్వరలో దర్శనాలు నిలిపివేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో రాజన్నను దర్శించుకుని తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఒకవైపు కార్తీక మాసం కావడం, మరోవైపు దర్శనాల నిలిపివేతపై రకరకాలుగా ప్రచారం జరుగుతుండడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో రాజన్న క్షేత్రం జాతరను తలపిస్తోంది.
News November 5, 2025
భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు BCCI జట్టును ప్రకటించింది. పంత్, అక్షర్ జట్టులోకి వచ్చారు.
✒ టెస్ట్ టీమ్: గిల్(C), పంత్ (VC), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్, సిరాజ్, ఆకాశ్, కుల్దీప్
✒ ODI IND-A టీమ్: తిలక్(C), రుతురాజ్(VC), అభిషేక్, పరాగ్, ఇషాన్, బదోని, నిషాంత్, V నిగమ్, M సుతార్, హర్షిత్, అర్ష్దీప్, ప్రసిద్ధ్, ఖలీల్, ప్రభ్సిమ్రాన్


