News April 5, 2025

MHBD: 100% టీకాల అందజేత పూర్తి చేయాలి: DMHO

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విస్తృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మైక్రో యాక్షన్ ప్లాన్ అవగాహన సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO రవి మాట్లాడుతూ.. సూపర్వైజర్స్, స్టాఫ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలన్నారు.

Similar News

News April 13, 2025

మాజీ మంత్రి మనవడికి 444 మార్కులు  

image

ఇంటర్ ఫలితాల్లో మాజీ మంత్రి నారాయణస్వామి మనవడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి తనయుడు భువన తేజ సత్తా చాటాడు. MPC విభాగం మొదటి సంవత్సరంలో ఆయన 444 స్కోర్ చేశాడు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

News April 13, 2025

బుగ్గనకు వైఎస్ జగన్ కీలక పదవి!

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

News April 13, 2025

నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి 

image

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్‌లు నిజామాబాద్‌లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. 

error: Content is protected !!