News April 5, 2025
రిషభ్ పంత్ మళ్లీ ఫెయిల్

LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి బ్యాటింగ్లో విఫలమయ్యారు. వరుసగా నాలుగో మ్యాచులోనూ ఆయన సత్తా చాటలేకపోయారు. ముంబైతో మ్యాచులో 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 4 మ్యాచుల్లో కలిపి పంత్ 19 పరుగులే చేశారు. దీంతో ఆయనపై SMలో మాజీలు, విశ్లేషకులు, క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా IPL మెగా వేలంలో పంత్ రూ.27 కోట్లు పలికి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.
Similar News
News December 27, 2025
రేపు ట్రంప్తో జెలెన్ స్కీ భేటీ!

US అధ్యక్షుడు ట్రంప్తో రేపు ఫ్లోరిడాలో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు, శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన 20సూత్రాల ప్రణాళికలో 90% మేర ఏకాభిప్రాయం కుదిరిందని జెలెన్ స్కీ చెప్పారు. రేపటి భేటీలో ఉక్రెయిన్కు US ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. కొత్త ఏడాదికి ముందే కీలక పరిణామాలు సంభవించొచ్చని తెలిపారు.
News December 27, 2025
జనవరి 3, 4, 5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు

AP: జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా, 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. NTR పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.
News December 27, 2025
వందలోపే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ది యాషెస్ సిరీస్ ఫోర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై పట్టు కోసం ఇంగ్లండ్ పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 152 రన్స్కే ఆలౌటైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ టైంకి 98/6(140 లీడ్) రన్స్ చేసింది. హెడ్(46) ఫర్వాలేదు అనిపించారు. ENG బౌలర్లలో కార్స్, జోష్ చెరో 2 వికెట్లు, అట్కిన్సన్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు. స్మిత్(16*), గ్రీన్(6*) బ్యాటింగ్ చేస్తున్నారు.


