News April 5, 2025
చాట్రాయి: ఆలయానికి చేరిన భద్రాది రామయ్య అక్షింతలు

భద్రాచలం రామాలయం నుంచి చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన కోదండ రామాలయానికి తలంబ్రాలు చేరుకున్నాయి. ప్రతి ఏటా భద్రాచలం రాములోరి అక్షింతలనే సీతారామ కళ్యాణానికి వినియోగించడం ఆనువాయితీగా వస్తోంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, పూజారి మారుతి తలంబ్రాలను సేకరించి స్వామివారి వద్ద భద్రపరిచారు. తలంబ్రాలను శనివారం పంపించానున్నారు.
Similar News
News September 17, 2025
విశాఖలో జీసీసీ బిజినెస్ సమ్మిట్ ప్రారంభం

రుషికొండలోని రాడీసన్ బ్లూ హోటల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ప్రారంభమయ్యింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు సిఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.
News September 17, 2025
పల్నాడు జిల్లాలో 30.8 మి.మీ వర్షపాతం

పల్నాడు జిల్లాలో గత 24 గంటల్లో 30.8 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మొత్తం ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా చిలకలూరిపేటలో 14.4 మి.మీ, నాదెండ్లలో 7.2, పిడుగురాళ్లలో 6.4, నూజెండ్లలో 1.6, ఈపూరులో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 1.1 మి.మీ వర్షపాతం నమోదైంది.
News September 17, 2025
జగిత్యాల: ‘మహిళల ఆరోగ్యం, కుటుంబ శక్తివంతం కోసం అభియాన్’

మహిళల ఆరోగ్యం బలోపేతం అయితేనే కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వస్థ నారి ససక్త పరివార్ అభియాన్ (హెల్తీ ఉమెన్ ఎంపవర్ ఫ్యామిలీ కాంపెయిన్)లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.