News April 5, 2025
హనుమకొండ: విషాదం.. బర్త్ డే మరుసటి రోజే మృతి

హన్మకొండ జిల్లాకు చెందిన వేద పాఠశాల విద్యార్థి <<15990250>>నిర్మల్(D)లో మృతి<<>> చెందినవిషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. అయితే నిన్న గోదావరినదికి హారతి ఇవ్వడానికి నదిలోని బోరుబావి మోటార్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. మణికంఠ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 2, 2026
విండీస్పై విజయం.. భారత్ కొత్త రికార్డులు

T20WC: వెస్ట్ఇండీస్పై విజయంతో సెమీస్కు దూసుకెళ్లిన భారత్ ఈ మ్యాచ్తో కొత్త రికార్డులు నమోదు చేసుకుంది. 196 పరుగల లక్ష్యాన్ని ఛేదించడంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్ తన హైయెస్ట్ సక్సస్ఫుల్ ఛేజ్ నమోదు చేసింది. అలాగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా తర్వాత అతిపెద్ద టోటల్ను ఛేజ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. T20WCలో సెమీస్కు ఆరుసార్లు క్వాలిఫై అయిన జట్టుగా ఇంగ్లండ్, పాక్ సరసన నిలిచింది.
News March 2, 2026
డీల్కు అతి చేరువలో ఉండగా US దాడి చేసింది: ఇరాన్ మంత్రి

అణు ఒప్పందానికి అతి చేరువలో ఉండగా US దాడులు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయిద్ అబ్బాస్ అరాఘ్చి విమర్శించారు. చర్చలు జరుగుతుండగానే దాడులు చేసి దౌత్యాన్ని ట్రంప్ నాశనం చేశారన్నారు. చివరగా జెనీవాలో చర్చలు జరిగాక వచ్చే సమావేశంలో ఈ డీల్ ఖాయం చేసుకోవాలని అనుకున్నామని తెలిపారు. కాగా ఇరాన్ డీల్కు సుముఖంగానే ఉన్నా ట్రంప్ కావాలనే దాడులు చేయించినట్లు వెస్ట్ మీడియాలో పలు ఆరోపణలు వస్తున్నాయి.
News March 2, 2026
కామారెడ్డి: ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి(M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులు గండ్ర స్వామి, వడ్ల విజయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు.


