News April 5, 2025

పాన్‌గల్: చెరువులో మృతదేహం లభ్యం

image

ఓ 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మండల కేంద్రంలోని పొల్కి చెరువులో లభ్యమైన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. ఈ వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. ఆయన చనిపోయిన స్థలంలో చెప్పులు, శాలువా, కల్లు ప్యాకెట్ కనిపించాయి. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో ఘటనను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 15, 2026

HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.

News January 15, 2026

BISAG-Nలో గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు

image

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్‌ (BISAG-N)లో 5 గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్, ఎంసీఏ, డిప్లొమా(గ్రాఫిక్స్)అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/

News January 15, 2026

ముగిసిన ఖర్మాస్.. ఇక శుభకార్యాల జోరు!

image

గత నెల రోజులుగా కొనసాగిన ఖర్మాస్ (అశుభ కాలం) నిన్నటితో ముగిసింది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. దీంతో ఇకపై వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, ఆస్తి కొనుగోళ్లకు తలుపులు తెరుచుకున్నాయి. దేవతల కాలం మొదలైనందున ఈ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్ర మౌఢ్యమి FEB 17 వరకు ఉంది.