News April 5, 2025
గన్నవరం: మహిళల్ని రక్షించబోయి మేస్త్రీ మృతి

గన్నవరం మండలం మాదలవారిగూడెంలో స్లాబ్ పనిలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లి చెందిన కాంక్రీట్ మేస్త్రీ పిల్లిబోయిన కొండలు (35) కూలీలతో కలిసి స్లాబ్ వేస్తున్నారు. ఆ సమయంలో సిమెంట్ తీసుకెళ్లె లిప్ట్ ఒక్కసారిగా తెగి కింద పడింది. అక్కడే మహిళల్ని తప్పించబోయి ఏడుకొండలు లిఫ్ట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 8, 2025
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నవాజుద్దీన్

కెరీర్ ఆరంభంలో ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏదైనా మూవీలో ఛాన్స్ వచ్చినా మళ్లీ పోతుందనే భావనలో ఉండేవాడినన్నారు. దీంతో ఆత్మహత్య ఆలోచనలూ వచ్చాయని చెప్పారు. 2012 నుంచి గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్, కహానీ, తలాష్ మూవీలు సక్సెస్ కావడంతో జీవితంపై ఆశ చిగురించిందని పేర్కొన్నారు.
News November 8, 2025
NLG: చెరువుకు చేరుతున్న చేప.. 6 కోట్ల చేప పిల్లల పంపిణీ

ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లలు చేరుతున్నాయి. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో ఆరు కోట్ల చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు 60 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
News November 8, 2025
కరీంనగర్: స్నాతకోత్సవం సరే.. సమస్యల సంగతేంటి?

శాతవాహన యూనివర్సిటీ సమస్యలతో తల్లడిల్లుతున్నా పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. 114 బోధన పోస్టులకు గాను 63, 51 బోధనేతర పోస్టులకు 9 మందితోనే నెట్టుకొస్తున్నారు. 47 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో, ఔట్సోర్సింగ్ సిబ్బందితోనే 12 విభాగాల్లోని 800 మంది విద్యార్థులకు బోధన నడుస్తోంది. నూతన ఇంజినీరింగ్, లా, ఫార్మసీ కళాశాలలకు గుర్తింపు రావాలంటే వెంటనే సిబ్బందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.


