News April 5, 2025
కరీంనగర్ వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను కరీంనగర్ జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
Similar News
News April 12, 2025
KNR: ప్రశాంతంగా ముగిసిన బ్యాంకింగ్ ఉచిత శిక్షణ పరీక్ష

బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ బ్యాంకింగ్ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఉచిత శిక్షణ పరీక్షకు మొత్తం 67 మంది హాజరైనట్టు తెలిపారు.
News April 12, 2025
కరీంనగర్: ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్రెడ్డి తెలిపారు. KNRభగత్నగర్కు చెందిన మెహర్తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.
News April 12, 2025
భగ్గుమంటున్న కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 42.3°C నమోదు కాగా, గంగాధర 41.5, జమ్మికుంట 41.2, చిగురుమామిడి, గన్నేరువరం 40.8, రామడుగు 40.7, చొప్పదండి 40.6, హుజూరాబాద్, కొత్తపల్లి, సైదాపూర్ 40.2, తిమ్మాపూర్, కరీంనగర్ 40.0, కరీంనగర్ రూరల్ 39.7, వీణవంక 39.5, శంకరపట్నం 39.1, ఇల్లందకుంట 38.4°C గా నమోదైంది.