News April 5, 2025
పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
Similar News
News September 16, 2025
NGKL: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిజిటల్ లైబ్రరీ ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మల్లురవితో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు. డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆధునిక సాంకేతిక వనరులు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని మల్లు రవి తెలిపారు.
News September 16, 2025
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో నాలుగో విడత ప్రవేశాలకు కన్వినర్ ప్రసాద్ బాబు మంగళవారం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఒకటికంటే ఎక్కువ ITIలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వ ITIలలో 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
News September 16, 2025
నడిగడ్డలో మట్టిలో కలుస్తున్న మానవ సంబంధాలు

నడిగడ్డలో మానవ సంబంధాలు మట్టిలో కలుస్తున్నాయి. భర్తలను టార్గెట్ చేసి భార్యలు హతమారుస్తున్నారు. 3 నెలల క్రితం గద్వాలకు చెందిన తేజేశ్వర్ను అతడి భార్య ఐశ్వర్య పెళ్లైనా నెలకే కిరాతకంగా హత్య చేయించింది. ఆ సంఘటన మరువకముందే మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో పద్మ తన భర్త వెంకటేష్పై వేడి నూనె పోసి చావుకు కారణమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్లేషకులు అంటున్నారు.