News April 5, 2025

జనగామ వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను జనగామ జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News January 25, 2026

APPLY NOW: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc కెమిస్ట్రీ, కెమికల్ ల్యాబ్‌లో పని అనుభవం గలవారు ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 20 వరకు పంపాలి. వయసు 18-36ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.41,970 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.900, SC,ST అభ్యర్థులకు రూ.185. వెబ్‌సైట్: https://recruit.cusat.ac.in

News January 25, 2026

సింగరేణి కార్మికులపై పన్ను భారం తగ్గించాలని వినతి

image

సింగరేణి కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక ప్రసాద్ తీసుకెళ్లారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సింగరేణిలోనూ వర్తింపజేయాలని వినతి పత్రం అందజేశారు.

News January 25, 2026

పశ్చిమగోదావరి జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం

image

ఓటర్ల నమోదులో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప.గో జిల్లాకు రాష్ట్రస్థాయిలో “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు-2025” లభించింది. ఆదివారం విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చేతుల మీదుగా కలెక్టర్ నాగరాణి పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంశాల్లో 12 జిల్లాలను ఎంపిక చేయగా, అత్యధిక ఓటర్ల నమోదులో ప.గో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.