News April 5, 2025
జనగామ వాసులూ.. APPLY చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను జనగామ జిల్లాలోని మీ MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
Similar News
News January 25, 2026
APPLY NOW: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

<
News January 25, 2026
సింగరేణి కార్మికులపై పన్ను భారం తగ్గించాలని వినతి

సింగరేణి కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక ప్రసాద్ తీసుకెళ్లారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సింగరేణిలోనూ వర్తింపజేయాలని వినతి పత్రం అందజేశారు.
News January 25, 2026
పశ్చిమగోదావరి జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం

ఓటర్ల నమోదులో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప.గో జిల్లాకు రాష్ట్రస్థాయిలో “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు-2025” లభించింది. ఆదివారం విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చేతుల మీదుగా కలెక్టర్ నాగరాణి పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంశాల్లో 12 జిల్లాలను ఎంపిక చేయగా, అత్యధిక ఓటర్ల నమోదులో ప.గో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.


