News April 5, 2025

సూర్యాపేట: 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ

image

సన్న బియ్యం పంపిణీలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సుమారు 65 శాతం దుకాణాలకు తరలించామన్నారు. మిగిలిన 2200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.

Similar News

News November 9, 2025

NZB: లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

image

లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో లక్ష్మీ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. లాడ్జి నిర్వాహకులు సాయిలు, రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News November 9, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ(<>NIH<<>>) 3 ప్రాజెక్ట్ సైంటిస్ట్, SRF, JRF పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ, పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్/హైడ్రాలజీ/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://nihroorkee.gov.in

News November 9, 2025

లైట్‌హౌస్‌ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు రకరకాల పద్దతుల ఉపయోగిస్తారు. వాటిలో ఒకటే లైట్‌హౌస్‌ పేరెంటింగ్. ఈ పద్ధతిలో పిల్లలు జీవితంలో అన్నిట్లో రాణించాలని పేరెంట్స్ అనుకుంటారు. ఆరోగ్యం, ఆనందం, విజయం వైపు వెళ్లడానికి వారికి మద్దతుగా నిలుస్తారు. ఇది పిల్లలు నేర్చుకోవడానికి, సానుకూలంగా ఎదగడానికి సాయపడుతుంది. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వారికి తోడుగా ఉంటారు. దీన్నే డాల్ఫిన్ పేరెంటింగ్‌ అని కూడా అంటారు.