News March 26, 2024

జగిత్యాల: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన <<12927777>>ఘర్షణ<<>> ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ప్రకాష్ అనే యువకుడు హోలీ ఆడుతుండగా పక్కింటి పైకి గుడ్డు విసిరాడు. దీంతో పక్కింటి రిషి, ఆయన తల్లి రమ అడగడంతో ప్రకాష్ కొడవలితో దాడిచేయగా రమకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 3, 2024

కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.

News October 3, 2024

KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

News October 3, 2024

ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

image

రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.