News April 5, 2025
జగిత్యాల: జిల్లా సెర్ప్ ఏపీఎంల యూనియన్ నూతన కార్యవర్గం

జగిత్యాల జిల్లా కేంద్రంలో సెర్ప్/ఐకేపీ ఎపిఎం ల యూనియన్ సమావేశంలో జగిత్యాల జిల్లా ఎపిఎంల యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే.శ్రీనివాసచక్రవర్తి, ఉపాధ్యక్షుడిగా ఏ. శంకర్, ప్రధాన కార్యదర్శిగా పి. నరహరి, సహాయ కార్యదర్శిగా డి. సమత, కోశాధికారిగా వై.రమాదేవి ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా ఆర్. చంద్రకళ, జి.సి.రాజయ్య నియమితులయ్యారు.
Similar News
News December 31, 2025
గ్రీటింగ్ కార్డ్స్ ❤

న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ సందడి. అంగట్లో ఛార్ట్ కొని ఫ్రెండ్స్కు విషెస్ చెబుతూ పంచేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అని ఫీలైన వారు ఎంతమందో. ఇంట్లో మారాం చేసయినా తమకు ఇష్టమైన నటీనటుల కార్డులు కొనేవారు. రాను రాను ఆ కార్డులు కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..
News December 31, 2025
పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. 22 మరణాలు

APలో <<18469690>>స్క్రబ్ టైఫస్<<>> కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 2 వేలకుపైగా కేసులు నమోదు కాగా 22మంది మరణించారు. గత మూడేళ్లుగా చిత్తూరు(D)లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది చిత్తూరులో అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, విశాఖ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శరీరంపై నల్లమచ్చతోపాటు జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
News December 31, 2025
పోలవరం ఇంఛార్జ్లుగా అల్లూరి జిల్లా అధికారులు

అల్లూరి జిల్లా అధికారులను నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు ఇంఛార్జ్లుగా నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడిన పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్ధర్, ఇంఛార్జ్ జేసీగా పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజను నియమించారు.


