News April 5, 2025
కంచ గచ్చిబౌలిలో 2000 ఎకరాల్లో ఎకో పార్క్.. నిజమేనా?

TG: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బదులు అక్కడే HCU భూమితో సహా 2000 ఎకరాలను ఎకో పార్క్గా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను HCU రిజిస్ట్రార్ దివేశ్ ఖండించారు. అలాంటి ప్లాన్ ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. వర్సిటీని తరలించేందుకు తాము ఒప్పుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని HCU SU VP ఆకాశ్ అన్నారు.
Similar News
News April 11, 2025
మూవీ ఇండస్ట్రీలోకి రొనాల్డో

పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ‘URMarv’ పేరిట ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోను లాంచ్ చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మాథ్యూ వాన్తో కలిసి పనిచేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ఫ్యాషన్, పర్ఫ్యూమ్, లగ్జరీ వాచ్లకు సంబంధించిన వ్యాపారాల్లో భాగమైన రొనాల్డో ఇప్పుడు సినిమాల్లోనూ అడుగు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఆయన యూట్యూబ్ ఛానల్నూ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
రికార్డు: 64 ఏళ్ల వయసులో టీ20ల్లో అరంగేట్రం

పోర్చుగల్ మహిళా క్రికెట్ జట్టు తరఫున జొన్నా చైల్డ్ 64 ఏళ్ల వయసులో టీ20 అరంగేట్రం చేశారు. దీంతో అతిపెద్ద వయసులో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో ప్లేయర్గా నిలిచారు. నార్వేతో జరిగిన మ్యాచులో ఆమె ఈ ఘనత అందుకున్నారు. ఈ లిస్టులో జిబ్రాల్టర్కు చెందిన సాలీ బార్టన్ (66 ఏళ్ల 334 రోజులు) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. నార్వేతో జరిగిన టీ20 సిరీస్ను పోర్చుగల్ 2-1 తేడాతో గెలుచుకుంది.
News April 11, 2025
ALERT.. రేపు వర్షాలు, వడగాలులు

AP: రాష్ట్రంలో రేపు విజయనగరం, SKLM, మన్యం, అల్లూరి, VZG, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, TPTY జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, NTR, బాపట్ల, పల్నాడులోని 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.