News April 5, 2025
విజయవాడ: రద్దైన Dy.CM పవన్ భద్రాచలం పర్యటన

డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి భద్రాచలం పర్యటన రద్దయినట్లు విజయవాడలోని ఆయన కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ప్రభుత్వం తరఫున భద్రాద్రి రామయ్యకు శ్రీరామ నవమి సందర్భంగా పవన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తొలుత సమాచారం వెలువడింది. తాజాగా పర్యటన రద్దైనట్లు పవన్ కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ అధికారులకు సమాచారం అందచేసింది.
Similar News
News November 7, 2025
వరంగల్లో డెంగీ డేంజర్ బెల్స్.. మొంథాతో పారిశుద్ధ్యం దెబ్బ!

వరంగల్ జిల్లాలో డెంగీ కేసులు ఆందోళనకర స్థాయికి చేరాయి. జనవరి నుంచి నవంబర్ 6 వరకు 240 కేసులు నమోదయ్యాయి. 100 మందిలో ఐదుగురికి పైగా పాజిటివిటీ రేటు నమోదైంది. తాజాగా, మొంతా తుఫాన్ ప్రభావంతో నగరంలో పారిశుద్ధ్యం దెబ్బతింది. వర్ష జలాలతో మురుగు నీరు కలిసి కాలువలు మూసుకుపోవడంతో దోమల పెరుగుదల తీవ్రంగా ఉంది. ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతుండగా.. అధికారులు తక్షణ శుభ్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 7, 2025
వందేమాతరం ఉత్సవం ఘనంగా నిర్వహించాలి: మన్యం డీఈవో

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్&జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ‘వందే మాతరం’ జాతీయ గీతం 150 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమిష్ఠిగా వందేమాతరం గీతం ఆలపించాలని మన్యం డీఈవో రాజ్ కుమార్ తెలిపారు.
News November 7, 2025
గన్నవరంలో యాక్టీవ్ అవుతున్న వల్లభనేని వంశీ

గన్నవవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో యాక్టీవ్ అవుతున్నారు. నకిలీ పట్టాల కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. ఒకానొక దశలో వంశీ పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల వై.ఎస్ జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వంశీ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


