News April 5, 2025

కోనసీమ: భీమేశ్వర ఆలయాన్ని దర్శించిన జడ్జి

image

ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని శనివారం తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సుజాత దర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్జిని ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి అల్లు వెంకట దుర్గా భవాని స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఆమె వెంట రామచంద్రపురం జడ్జి ఎన్.శారద ఉన్నారు. 

Similar News

News September 16, 2025

GST ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన మదర్ డెయిరీ

image

GST శ్లాబులను సవరించిన నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. లీటర్ పాల ధర ప్రస్తుతం రూ.77 ఉండగా రూ.75కు తగ్గించామని తెలిపింది. నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్స్ రేట్లనూ తగ్గించినట్లు వెల్లడించింది. పాలపై సున్నా, మిగతా ఉత్పత్తుల(పనీర్, బట్టర్, చీజ్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్)పై 5% జీఎస్టీ ఉంటుందని తెలిపింది.

News September 16, 2025

GDK: ‘సెలవులకు ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి’

image

దసరా సెలవులకు ఊర్లకు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి DCP P.కరుణాకర్‌ సూచించారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వారికి సమాచారం ఇస్తే పెట్రోలింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఊర్లకు వెళ్తే విలువైన వస్తువులను ఇండ్లలో వదిలి వెళ్లవద్దని, బ్యాంక్‌ లాకర్‌లో భద్ర పరుచుకోవాలని సూచించారు. ఇంటిని గమనిస్తూ ఉండాలని చుట్టూ పక్కల వారికి తెలిపి వెళ్లాలని సూచించారు.

News September 16, 2025

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

image

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.