News April 5, 2025

సంక్షేమ హాస్టల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

image

AP: NTR జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ల పర్యటనలో భాగంగా బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని CM చంద్రబాబు సందర్శించారు. పాఠశాల మొత్తం కలియతిరిగిన ఆయన వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, సరకుల నాణ్యతను తనిఖీ చేశారు. భోజనం రుచిగా, నాణ్యతతో అందిస్తున్నారా? అని విద్యార్థులను ఆరా తీశారు. మెనూ ప్రకారం ఫుడ్ అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు.

Similar News

News September 13, 2025

నంద్యాల కొత్త SP ఈయనే.!

image

నంద్యాల ఎస్పీగా సునీల్ షెరాన్ రానున్నారు. ప్రస్తుత ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సునీల్ బాధ్యతలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 14 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

News September 13, 2025

IBలో 394 జాబ్స్.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. SC, STలకు ఎగ్జామ్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీలు రూ.500 చెల్లించాలి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.<> www.mha.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 13, 2025

రేపే INDvsPAK.. మ్యాచ్ చూస్తారా?

image

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజే వేరు. కొందరైతే ఎంత ఖర్చయినా సరే విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తుంటారు. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాయాదుల పోరుపై చాలామంది ఇంట్రెస్టే చూపట్లేదు. కొందరేమో మ్యాచ్‌ను మ్యాచ్‌లా చూడాలంటున్నారు. SMలో ఇంత రచ్చ అవుతున్నా BCCI & ప్లేయర్లు స్పందించలేదు. ఇంతకీ రేపు జరిగే మ్యాచ్‌ను మీరు వీక్షిస్తారా? బహిష్కరిస్తారా? కామెంట్ చేయండి.