News April 5, 2025
నిమ్స్లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.
Similar News
News September 13, 2025
GWL: కేటీఆర్ సభకు గద్వాల ఎమ్మెల్యే హాజరవుతారా?

గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు గద్వాలలో జరిగే కేటీఆర్ బహిరంగ సభకు ఆయన హాజరవుతారా లేదా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది.
News September 13, 2025
అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగించారు. రాయచోటి 1, మదనపల్లె 1, పీలేరు 1 చొప్పున బార్లకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత సమయానికి ముందుగా అబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. లాటరీ పద్ధతిలో కేటాయింపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ PGRS హాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
News September 13, 2025
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.