News April 5, 2025
పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

ఏప్రిల్ 27న వరంగల్లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.
Similar News
News April 7, 2025
రేపు అహ్మదాబాద్కు సీఎం రేవంత్

TG: గుజరాత్లో రేపు, ఎల్లుండి జరిగే ఏఐసీసీ సమావేశాలకోసం సీఎం రేవంత్ రేపు అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, పలువురు కీలక నేతలు ఈరోజు సాయంత్రమే బయలుదేరనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44మంది నేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయని సమాచారం.
News April 7, 2025
రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

AP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.
News April 7, 2025
అఖిల్ నెక్స్ట్ మూవీ.. రేపు గ్లింప్స్?

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ వచ్చి రెండేళ్లైనా ఆయన మరే ప్రాజెక్టునూ అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్కు అఖిల్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాతోనైనా అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.