News April 5, 2025
వక్ఫ్ బోర్డు పేరుతో భూ ఆక్రమణలు ఉండవు: యోగి ఆదిత్యనాథ్

వక్ఫ్ బోర్డు పేరుతో భూఆక్రమణలు చేయటం ఇక సాధ్యపడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. UPలో లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ పేరుతో ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆస్పత్రులు, కళాశాలలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
Similar News
News November 6, 2025
BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.
News November 6, 2025
IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<
News November 6, 2025
కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.


