News April 5, 2025
KMR: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: MLC కవిత

నీటి నిర్వహణపై అవగాహన లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని.. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే అని ఉమ్మడి NZB జిల్లా MLC కవిత మండిపడ్డారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లా టేకుల సోమారంలో పంటలకు సాగు నీరు అందక చేతికొచ్చే పంటలు ఎండిపోయాయి. పుట్టెడు దుఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కింది. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని’ X వేదికగా ఆమె రాసుకొచ్చారు.
Similar News
News April 7, 2025
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

TG: ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ కోటాలో అంజిరెడ్డి, మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్యే కోటాలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ ఎన్నికయ్యారు. ఉ.11 గంటలకు శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా ప్రమాణం చేయిస్తారు. దాసోజు మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని BRS తెలిపింది.
News April 7, 2025
విశాఖలో కేజీ అల్లం ధర ఎంతంటే?

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ. కిలో) టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళా దుంపలు రూ.17, బెండకాయలు రూ. 28, కాకరకాయలు రూ.34, క్యారెట్ రూ.32/34, మునగ కాడలు రూ.24, అల్లం రూ.48, బరబాటి రూ.30, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, పాటల్స్ రూ.64, చామ రూ.26, దేవుడు చిక్కుడు రూ.60, గ్రీన్ పీస్ రూ.60గా ధరల నిర్ణయించారు.
News April 7, 2025
తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నర్సంపేట వాసుల ప్రతిభ

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రతిభ కనబర్చారు. వరంగల్లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్ను అందుకున్నారు. కోచ్లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.