News April 5, 2025
మయన్మార్కు అండగా భారత్

మయన్మార్కు 442 మెట్రిక్ టన్నుల ఆహార సామాగ్రిని తాజాగా భారత్ అందజేసింది. దీనికి సంబంధించిన నౌక ఈ రోజు మయన్మార్ చేరుకుంది. ఇటీవల వచ్చిన తీవ్ర భూకంపంతో ఆ దేశంలో 3వేలకు పైగా పౌరులు మృతి చెందడంతో పాటు, ఆస్తినష్టం జరిగింది. దీంతో ‘ఆపరేషన్ బ్రహ్మ’లో భాగంగా సాయం అందజేస్తామని భారత్ ప్రకటించింది. భూకంపం వచ్చిన 24 గంటలలోపే విపత్తు నివారణ సహాయక సామాగ్రిని మయన్మార్కు పంపించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 7, 2025
బాలీవుడ్లోకి తెలుగు హీరోయిన్ ఎంట్రీ!

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ రాకేశ్ జగ్గి దర్శకత్వంలో నటిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఈ మూవీలో ఆమె డీగ్లామర్ రోల్లో కనిపించనుండగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని సమాచారం. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.
News April 7, 2025
ఆరడుగుల బస్సులో ఏడడుగుల కండక్టర్.. వైరలవడంతో!

TG: తన ఎత్తు కారణంగా కండక్టర్గా పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అహ్మద్పై వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. 7ft ఉన్న అహ్మద్ మెహదీపట్నం(HYD) డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. బస్సులోపల 6.4ftల ఎత్తే ఉండటంతో మెడ వంచి ఉద్యోగం చేయడంతో మెడ, వెన్నునొప్పి వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇది CM రేవంత్ దృష్టికి వచ్చిందని, అతనికి RTCలో సరైన ఉద్యోగం ఇవ్వాలని RTC ఎండీ సజ్జనార్కు సూచించారు.
News April 7, 2025
గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లో రూ.1,00,000 జమ!

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తొలి దశలో 71 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా వీరిలో 12వేల మంది నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ 1,200 మంది బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేశారు. వీరి ఖాతాల్లో తొలి విడతగా ఈ వారమే రూ.లక్ష జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు డబ్బుల్లేక పనులు ప్రారంభించని వారికి డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు అందించాలని నిర్ణయించారు.